ఇండియన్ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తన వైవాహిక జీవితానికి ముగింపు పలకబోతుంది. భర్తతో విడాకులకు సిద్ధమైంది. ఆదివారం తన భర్త పారుపల్లి కశ్యప్ నుండి విడిపోతున్నట్లు సైనా నెహ్వాల్ అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. `జీవితం కొన్నిసార్లు మనల్ని వేర్వేరు దిశల్లోకి తీసుకెళుతుంది. ఎన్నో ఆలోచనలు, మరెన్నో చర్చల అనంతరం కశ్యప్ పారుపల్లి మరియు నేను విడిపోవాలని నిర్ణయించుకున్నాము. మానసిక ప్రశాంతత, ఎదుగుదల, స్వస్థతను కోరుకుంటూ మాకోసం తీసుకున్న నిర్ణయమిది. ఇప్పటివరకూ ఉన్న చిరస్మరణీయ జ్ఞాపకాలకు కృతజ్ఞతలు. ఈ సమయంలో మా గోప్యతను అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను` అంటూ సైనా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది.