ఈ నేపథ్యంలోనే తాజాగా కర్ణాటక ప్రభుత్వం సినిమా టికెట్ ధరలపై కీలక నిర్ణయం తీసుకుంది. వినోదపు పన్ను సహా ఇకపై సినిమా టికెట్ రేటు రూ. 200 మించకుండా ఉండాలని నోటిఫికేషన్ జారీ చేసింది. ఇది రాష్ట్రంలోని సింగిల్ స్క్రీన్స్ తో పాటు మల్టీప్లెక్స్ లకు కూడా వర్తిస్తుంది. అలాగే కన్నడ సినిమాలతో పాటు ఇతర భాష చిత్రాలు కూడా ఇదే రోల్ ను ఫాలో అవ్వాలని ప్రభుత్వం తెలిపింది.