టీమిండియా మహిళా జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ చరిత్ర సృష్టించింది. చెస్టర్ లీ స్ట్రీట్లో జరిగిన మూడో వన్డేలో అద్భుత సెంచరీతో చెలరేగిపోయింది. ఇంగ్లండ్లో మూడో శతకం సాధించిన తొలి విదేశీ మహిళా క్రికెటర్గా రికార్డు నెలకొల్పింది. ఈ సెంచరీతో మిథాలీ రాజ్, మేగ్ లానింగ్ల రికార్డులను అధిగమించింది. అదేవిధంగా వన్డేల్లో 4000 పరుగులు పూర్తి చేసిన మూడో భారతీయ మహిళగా కూడా హర్మన్ ప్రీత్ కౌర్ నిలిచింది.

హిస్టరీ క్రియేట్ చేసిన హర్మన్ ప్రీత్ కౌర్.. ఇంగ్లండ్ గడ్డపై సెంచరీలతో వీరంగం!
Posted on: 23-07-2025
Categories:
Sports