వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇటీవలే విజయవాడ జైలు నుంచి విడుదల అయ్యారు. టీడీపీ ఆఫీసుపై దాడి, ఫిర్యాదుదారుడ్ని అపహరించిన వ్యవహారంలో ఫిబ్రవరి 16న వల్లభనేని వంశీ అరెస్టయ్యారు. ఆ తర్వాత ఆయనపై దాదాపుగా 11 కేసులు నమోదు అయ్యాయి. 140 రోజుల పాటు జైలు జీవితాన్ని గడిపిన వంశీ.. ఎట్టకేలకు ఈనెల మొదటి వారంలో బయటకు వచ్చారు. అయితే వంశీ మళ్లీ అరెస్ట్ కాబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది.