తెలంగాణలో మరో పొలిటికల్ హీట్ స్టార్టయింది. తనపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నను పదవి నుంచి సస్పెండ్ చేయాలని బీఆర్ ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డికి ఆమె ఫిర్యాదు చేశారు. మహిళల ఆత్మగౌరవంపై తీన్మార్ మల్లన్న దాడి చేశారని ఆమె పేర్కొన్నారు. మహిళల పట్ల ఇంత నీచంగా మాట్లాడతారా? అని నిప్పులు చెరిగారు. తెలంగాణ సమాజం వీటిని హర్షించబోదన్నారు.