కోవూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడి వ్యవహారం ఏపీలో రాజకీయ వేడి రాజేసిన సంగతి తెలిసిందే. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు ఇంట్లో వస్తువులు, కారు ధ్వసం చేశారు. అయితే, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై నల్లపురెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె అనుచరులు ఈ దాడికి పాల్పడ్డారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ ప్రచారంపై ప్రశాంతి రెడ్డి స్పందించారు.