ఏపీలో గత కొద్దిరోజుల నుంచి సంచలనం రేపుతున్న మద్యం కుంభకోణం కేసులో కీలకంగా ఉన్న వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి ఎట్టకేలకు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. శనివారం విజయవాడలోని సిట్ కార్యాలయంలో సుమారు ఏడు గంటల పాటు విచారించిన అనంతరం అధికారులు మిథున్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అయితే మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణికం ఠాగూర్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.