ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం కేసు ఊహించని మలుపు తిరిగింది. సిట్ అధికారులు రంగంలోకి దిగి నిందితుల ఇళ్లల్లో సోదాలు చేయగా, హైదరాబాద్ శివారులో రాజ్ కెసిరెడ్డికి సంబంధించిన రూ.11 కోట్ల నగదు పట్టుబడింది. ఈ డబ్బును ఒక గెస్ట్ హౌస్లో దాచిపెట్టారు. ఈ వ్యవహారం వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో సిట్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది.