లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ కోసం ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సిట్ ఆయనను ఏ4గా చేర్చింది. గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టులో బెయిల్ తిరస్కరణకు గురైంది. వైఎస్సార్ సీపీ హయాంలో మద్యం విధానాల్లో మిథున్ రెడ్డి పాత్ర కీలకంగా ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఇతర నిందితుల బెయిల్ పిటిషన్లను కోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో సిట్ విచారణ వేగవంతం చేసింది, శ్రావణి డిస్టిలరీస్ డైరెక్టర్కు నోటీసులు జారీ చేసింది.