నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హంద్రీనీవా ప్రాజెక్టు నీటిని గురువారం మధ్యాహ్నం విడుదల చేశారు. మూడు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని నేరుగా సీఎం చంద్రబాబు మాల్యాలకు చేరుకుని.. అక్కడ జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన చంద్రబాబు, రాయలసీమ కరవును తాను దగ్గర నుంచి చూశానని, హంద్రీనీవా, గాలేరు నగరి వంటి ప్రాజెక్టులకు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు.