హిందూపురం వైసీపీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఫ్యాన్ పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలను అధినేత వైఎస్ జగన్ సస్పెండ్ చేశారు. ఈ విషయం ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శ్రీసత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం నందమూరి బాలకృష్ణ అడ్డాగా మారిపోయింది. గత మూడు ఎన్నికల్లో బాలకృష్ణ హిందూపురం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున వరుసగా అసెంబ్లీకి ఎన్నిక అవుతున్నారు. అయితే బాలయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో వైసీపీకి చెందిన ఇద్దరు కీలక నేతలకు జగన్ షాక్ ఇచ్చారు.