హిందీ భాషను వ్యతిరేకిస్తూ తమిళనాడు అధికార పార్టీ డీఎంకే చాలా కాలంగా గళం వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తమిళనాడుతో పాటు మరికొన్ని రాష్ట్రాలు కూడా తమ ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యతనిస్తామని హిందీని వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి స్పందించారు. భాషతో సంబంధం లేకుండా విద్య, ఉపాధి, వ్యాపార అవకాశాల కోసం ప్రజలు ముందుకు వెళుతున్నారని పవన్ అన్నారు.