ఏపీలో గత ఏడాది కూటమి అధికారంలోకి వచ్చాక కేసులు, అరెస్టులు భయంతో వైసీపీ నేతలు సైలెంట్ అయ్యారు. కొందరు జగన్ కు టాటా చెప్పి పార్టీ మారిపోయారు. అయితే ఈ మధ్యకాలంలో మాజీ మంత్రి పేర్ని నాని వైసీపీ తరఫున బలమైన వాయిస్ వినిపిస్తున్నారు. రేషన్ బియ్యం స్కామ్లో తాను సేఫ్ అని అనుకున్నారో ఏమో.. కొద్ది రోజుల నుంచి పదే పదే మీడియా ముందుకు వస్తూ కూటమి ప్రభుత్వంపై విమర్శలకు గుప్పిస్తున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తనదైన స్టైల్ లో ఇచ్చిపడేశారు.