ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో రూ.70 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు, దీని ద్వారా లక్ష మందికి ఉద్యోగాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సింగపూర్తో సంబంధాల పునరుద్ధరణ, నిరుపేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు వంటి అంశాలపై చర్చించారు. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. నీటి పన్నుపై వడ్డీ రద్దు, తిరుపతి తొక్కిసలాట ఘటనపై కేబినెట్ చర్యలు తీసుకున్నారు.