ఇంగ్లాండ్ గడ్డపై భారత మహిళల జట్టు తొలిసారి ఒకే పర్యటనలో టీ20, వన్డే సిరీస్ను కైవసం చేసుకుంది. హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత జట్టు టీ20 సిరీస్ను 3-2తో.. వన్డే సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. మూడో వన్డేలో 13 పరుగుల తేడాతో విక్టరీ నమోదు చేసింది. తొలుత 318 పరుగులు చేసిన టీమిండియా.. అనంతరం ఇంగ్లాండ్ను 305 పరుగులకు పరిమితం చేసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచింది.

ఇంగ్లాండ్ గడ్డపై చరిత్ర సృష్టించిన టీమిండియా.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా..!
Posted on: 23-07-2025
Categories:
Sports