టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు విజన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 20 ఏళ్ల క్రితమే విజన్ 20 20 అంటూ ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని ఆనాడే అంచనా వేసిన దార్శనికుడు చంద్రబాబు. ఐటీ రంగం మాదిరిగానే జనాభా పెరుగుదల ఆవశ్యకతపై చంద్రబాబు కొంతకాలంగా కీలక వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రపంచ జనాభా దినోత్సవ సదస్సులో పాల్గొన్న చంద్రబాబు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.