ఏపీ సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. మరోసారి జరిగే ఎన్నికల్లో కూడా.. కూటమి అధికారం లోకి వస్తుందన్నారు. అవసరమైతే.. తాను చెప్పింది రాసిపెట్టుకోవాలని ఆయన పెట్టుబడిదారులకు సూ చించారు. ``రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారు తరచుగా అడుగుతున్న ప్రశ్న ఇదే. మళ్లీ మీరే అధికా రంలోకి వస్తున్నారా? అని. ఔను. వారికి నేను ఒక్కటే చెబుతున్నా.. మళ్లీ వచ్చేది కూటమి ప్రభుత్వమే. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహం అవసరం లేదు. దీనికి నేను హామీ ఇస్తున్నా.`` అని చంద్రబాబు తేల్చి చెప్పారు.