ఏపీ సీఎం చంద్రబాబు మంత్రం.. పెట్టుబడి దారుల్లో భరోసా కల్పిస్తోంది. ఏపీకి వచ్చేందుకు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు వారు మొగ్గు చూపుతున్నారు. తాజాగా మంగళవారం మంత్రి నారా లోకేష్ బెంగళూరులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పెట్టుబడులు పెట్టాలని కోరుతూ.. పారిశ్రామిక, ఐటీ వర్గాలకు విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు విజన్ను వారికి వివరించారు. సాధారణంగా ఇలా పిలుపుని వ్వడం.. పెట్టుబడులను ఆహ్వానించడం కామనే.