టాలీవుడ్ హిట్ జోడి విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా మళ్లీ కలిసి నటించనున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్లో తెరకెక్కనున్న ‘వీడీ 14’ చిత్రంలో రష్మిక కథానాయికగా ఎంపికైందని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం రాయలసీమ హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో రూపొందనుందని తెలుస్తోంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. గతంలో ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’లో విజయవంతమైన జంటగా నిలిచిన విజయ్, రష్మిక కాంబినేషన్ రిపీట్ అవుతుందన్న వార్త ఫ్యాన్స్ని ఖుషీ చేస్తోంది.

విజయ్ - రష్మిక జోడీ రిపీట్?.. ఫ్యాన్స్కి ఇంతకంటే ఏం కావాలి
Posted on: 31-07-2025
Categories:
Movies