వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని మరోసారి నోరు పారేసుకున్నారు. ఇటీవల కృష్ణ జిల్లా పామర్రులో జరిగిన పార్టీ సమావేశంలో `రప్పా రప్పా` అంటూ పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో చెప్పక్కర్లేదు. పలుచోట్ల ఆయనపై కేసులు కూడా నమోదు అయ్యాయి. అయినప్పటికీ పేర్ని నాని తీరు మారలేదు. పెడనలో ఆదివారం నిర్వహించిన వైకాపా సమావేశంలో నాని మళ్లీ రెచ్చిపోయారు. తాను చేసిన రప్పా రప్పా వ్యాఖ్యలను సమర్థించుకోవడమే కాకుండా కూటమి నేతలను అరేయ్ ఒరేయ్ అంటూ అవమానకర పదజాలంతో విమర్శలు చేశారు.