ఏపీ పాలిటిక్స్ లో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో విపక్ష వైసీపీ చిహ్నాన్ని మార్చాలని, గొడ్డలి గుర్తు కేటాయించాలని ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎలక్షన్ కమిషన్కు తాజాగా లేఖ రాయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వైఎస్ఆర్సీపీ అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అని చాలామంది అనుకుంటారు. కానీ కాదు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీని స్థాపించింది కూడా జగన్ కాదు. కోలిశెట్టి శివకుమార్ మొదట వైఎస్ఆర్సీపీ భారత ఎన్నికల కమిషన్లో నమోదు చేయడం జరిగింది.