తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు దగ్గర నుంచి ఆరు గ్యారెంటీ పథకాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. అయితే వీటిలో చాలా వరకు పథకాలకు ప్రామాణిక పత్రంగా రేషన్ కార్డులను అడుగుతున్నారు. ఈ కార్డు ఉంటేనే పథకాలకు అర్హులుగా ప్రభుత్వం పేర్కొంది. అయితే ఇప్పటికే రేషన్ కార్డులు పొందిన వారు ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరించారు.