ఆఫీసుకెళ్తున్నా,

ఆఫీసుకెళ్తున్నా, ఆఫీసు నుంచి ఇంటికెళ్తున్నా ప్రమాదం జరిగిందంటే కంపెనీదే బాధ్యత..: సుప్రీం కోర్టు

Posted on: 30-07-2025

Categories: Politics

ఉద్యోగులు ఆఫీసుకు వెళ్లేటప్పుడు, ఆఫీసు నుంచి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు లేదా ఉద్యోగంలో భాగంగానే ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ప్రమాదానికి గురైతే పరిహారం పొందడానికి అర్హులేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ప్రమాదానికి, ఉద్యోగానికి మధ్య సంబంధం ఉన్నట్లు నిరూపిస్తే ఈసీ చట్టం కింద ఉద్యోగికి పరిహారం లభిస్తుందని పేర్కొంది. వాచ్‌మెన్ మరణించిన కేసులో బాంబే హైకోర్టు తీర్పును కొట్టివేస్తూ.. ఉద్యోగి ప్రయాణాన్ని కూడా ఉద్యోగంలో భాగంగానే పరిగణించాలని కోర్టు వెల్లడించింది. సదరు కంపెనీ అతడికి నష్ట పరిహారం చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది.

Sponsored