వైసీపీ అధినేత జగన్ చిత్తూరు జిల్లా పర్యటన మరోసారి వివాదంగా మారింది. జగన్ వస్తున్నారంటేనే.. అధికారులు, పోలీసులు బిక్కచచ్చిపోతున్నారు. ఎక్కడ ఏం జరుగుతుందో.. కార్యకర్తలు, నాయకులు ఎలా రెచ్చిపోతారోనని.. బితుకుబితుకు మంటున్నారు. ఈ క్రమంలోనే ఆంక్షలు పెడుతున్నారు. అయినా.. ఆ ఆంక్షలేమీ లెక్కచేయకుండానే.. కార్యకర్తలు, నాయకులు కూడా వ్యవహరిస్తున్నారు. తాజాగా బంగారు పాళ్యంలో పర్యటించడానికి జగన్ రాకముందే.. కార్యకర్తలు హంగామా సృష్టించారు.