కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, ఫైర్ బ్రాండ్ నాయకుడు తీన్మార్ మల్లన్న కార్యాలయం వద్ద తీవ్ర రచ్చ చోటు చేసుకుంది. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ అంశం హాట్హాట్గా మారిన నేపథ్యంలో బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవితపై మల్లన్న కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ ఎస్ అధికారంలో ఉండగా.. కవిత స్పందించలేదని.. ఇప్పుడు రోడ్డెక్కుతున్నారని.. రైలు రోకోలకు పిలుపు ఇస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మరికొన్న ఇవివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారని కవిత వర్గం చెబుతోంది.