ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, చట్టం, రాజ్యాంగ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆరోపించారు. తమపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేది లేదని అన్నారు. ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.