మే

మే 9న జేడీ వాన్స్ చాలాసార్లు కాల్ చేశారు, కానీ... ఆపరేషన్ సిందూర్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు

Posted on: 30-07-2025

Categories: Politics

లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీ పహల్గామ్ ఉగ్రదాడి, సింధూర్ ఆపరేషన్‌పై చర్చలో పాల్గొని విపక్షాల ఆరోపణలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల ప్రధావ స్థావరాలును మట్టుబెట్టామని, ఇది భారత్‌కు గొప్ప విజయమని ఆయన అన్నారు. అంతేకాదు, సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చామని వివరించారు, పాక్‌లోని ఉగ్రవాదులను మట్టిలో కలిపేశామని అన్నారు. కానీ, కాంగ్రెస్ మాత్రం దేశానికి మద్దతు ఇవ్వలేదని మోదీ విమర్శించారు, పాక్ అణు బెదిరింపులకు భయపడలేదని పేర్కొన్నారు.

Sponsored