2024 సార్వత్రిక ఎన్నికలలో అఖండ విజయం సాధించి సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత చంద్రబాబు పదే పదే ఒక మాట చెబుతూ వస్తున్నారు. అధికారులు, ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయకుంటే 95 నాటి సీఎం చంద్రబాబును చూడాల్సి వస్తుందని హెచ్చరిస్తూనే వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రెవెన్యూ శాఖ పనితీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసిన తీరు 95 నాటి సీఎం చంద్రబాబును గుర్తు చేసిందని తెలుస్తోంది.