ఏపీలో గత ఎన్నికల సమయంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఫ్రీ బస్ స్కీమ్ ఒకటి. తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని కూటమి పార్టీ నాయకులు హామీ ఇచ్చారు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో కూటమి అధికారంలోకి వచ్చింది. ఇటీవలె ఏడాది పాలనను కూడా పూర్తి చేసుకుంది. కానీ ఇంతవరకు ఫ్రీ బస్సు స్కీమ్ అమలు కాకపోవడం పట్ల ప్రతిపక్ష వైసీపీ ఘాటు విమర్శలు గుప్పిస్తోంది.