కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాలలో విద్యార్థినిధులను అక్కడ పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపణ రావడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలోనే లైంగిక వేధింపులకు పాల్పడిన నలుగురిని అధికారులు సస్పెండ్ చేశారు. విద్యార్థినులను వేధింపులకు గురిచేసిన ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.