మద్యం కుంభకోణంలో ప్రజల రక్తాన్ని పీల్చి వేల కోట్లు సొమ్ము చేసుకున్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. లిక్కర్ స్కామ్ కేసులో ఏ4 గా ఉన్న మిథున్ రెడ్డికి విజయవాడలోని ఏసీబీ కోర్ట్ ఆగస్టు 1 వరకు రిమాండ్ విధిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో అదే రోజు ఆయనను పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.