కంగనా రనౌత్. ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్. సొంత పార్టీ అయినా.. పరాయి పార్టీ అయినా.. నిప్పును కడిగినట్టు కడిగేయడం ఆమె నైజం. ఇక, బాలీవుడ్ హీరోయిన్గా తెరపై కోట్ల మందిని అలరించి ఫిలింఫేర్ అవార్డు సహా... పద్మశ్రీ అవార్డును కూడా సొంతం చేసుకున్న నటీమణి. చాలా చిన్న వయసులోనే ఆమె రాజకీయ బాటపట్టారు. తొలుత కొన్ని రోజులు కాంగ్రెస్లో ఉన్నారు. కానీ, రాహుల్పై నేరుగా విమర్శలు చేసి.. బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే బీజేపీ ఆమెను స్వాగతించింది.