మరోమారు

మరోమారు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ... ఎందుకోసమంటే...

Posted on: 15-07-2025

Categories: Politics | Andhra | Telangana

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరోమారు భేటీ కానున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుల మధ్య గతేడాది జూలైలో హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్‌లో సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమస్యలపై ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలు, సమస్యల పరిష్కారంపై చర్చించారు. ఇరు రాష్ట్రాల మంత్రులు, అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఏడాది తర్వాత మరోసారి ఇరు రాష్ట్రాల సీఎంలు సమావేశం కాబోతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య జలవివాదంపై వీరు చర్చించనున్నారు. కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది.

Sponsored