తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు బీసీ రిజర్వేషన్లు కొలిక్కి వచ్చే వరకు వాయిదా పడే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్లపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ ఆగస్టు 5న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేయనున్నారు. రాష్ట్రపతి, ప్రధానితో పాటు ఇండియా కూటమి మద్దతు కోరనున్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం అన్ని పార్టీల బీసీ నాయకులు సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఎన్నికలు ఆలస్యమైతే నిధుల విడుదలలో ఇబ్బందులు వస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.