టీడీపీ అంటేనే కార్యకర్తల పార్టీ అన్న టాక్ ఉన్న సంగతి తెలిసిందే. కార్యకర్తలకు ఏ చిన్న కష్టం వచ్చినా సరే తామున్నామంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ ముందుకు వస్తుంటారు. ఈ క్రమంలోనే క్యాన్సర్ తో పోరాడుతున్న ఓ టీడీపీ కార్యకర్తకు సీఎం చంద్రబాబు స్వయంగా వీడియో కాల్ చేసి మాట్లాడిన వైనం వైరల్ గా మారింది. చంద్రబాబుతో మాట్లాడాలన్న ఆ కార్యకర్త చివరి కోరికను నెరవేర్చారు.