ఇండియన్ క్రికెట్ టీంలో ఒక తెలుగు వాడు ఉంటేనే మన వాళ్లు చాలా ఎగ్జైట్ అవుతారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు క్రికెటర్లు టెస్ట్ టీంలో ఆడుతున్నారు. వారిలోె ఒకరు ఆంధ్రప్రదేశ్కు చెందిన నితీశ్ కుమార్ రెడ్డి కాగా.. మరొకరు హైదరాబాద్ వాసి మహ్మద్ సిరాజ్. నితీశ్ అచ్చ తెలుగు కుర్రాడు కాగా.. సిరాజ్కు కూడా తెలుగు తెలిసే ఉంటుంది. నితీశ్ ‘తెలుగు’ ప్రభావం జట్టు మీద బాగానే ఉందని ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్టు సందర్భంగా దేశం మొత్తానికి అర్థమైంది.