కాంగ్రెస్ నుంచి ఇటీవల సస్పెన్షన్కు గురైన ఆ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తాజాగా సంచలన వ్యా ఖ్యలు చేశారు. తనను సస్పెండ్ చేసినా.. పార్టీ నుంచి బహిష్కరించినా.. తాను ప్రజల తరపున, ముఖ్యం గా బీసీల తరఫున కొట్లాడుతానని స్పష్టం చేశారు. తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక.. తనను సస్పెండ్ చేశారని పేర్కొన్న ఆయన.. రేవంత్ రెడ్డి సర్కారు చేపట్టిన కుల గణనపై మరోసారి విమర్శలు గుప్పించారు. ఈ కులగణన తప్పుల తడగా మారిందన్నారు.

తగ్గేదేలే అంటోన్న తీన్మార్ మల్లన్న