ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తనతో భుజం భుజం కలిపిన తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఆ రాష్ట్ర సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గట్టి షాకే ఇచ్చారు. వారికి ఫిట్మెంట్ను 7.5 శాతం మాత్రమే పెంచుతూ తెలంగాణ రాష్ట్ర తొలి వేతన సవరణ సంఘం (పీఆర్సీ) చేసిన సిఫారసును ఆయన ఆమోదించినట్లు తెలిసింది. పీఆర్సీ సిఫారసులపై ఉద్యోగ సంఘాలు మండిపడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగాయు. అయినా ఫలితం లేకపోయింది. నివేదికను యథాతథంగా అమలు చేయాలని కేసీఆర్ ప్రభుత్వం భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

తెలంగాణ ఉద్యోగులకు కేసీఆర్ షాక్!