Headline Image
ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా

ఇటీవల వెలువడిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో బీజేపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ హస్తినలో కమలం వికసించింది. అయితే, ఫలితాలు వెలువడి 12 రోజులు కావస్తున్నా ఢిల్లీకి కాబోయే సీఎం ఎవరు అన్నదానిపై సస్పెన్స్ వీడలేదు. ఈ క్రమంలోనే ఆ ఉత్కంఠకు బీజేపీ అధిష్టానం తాజాగా తెరదించింది. షాలీమార్ బాగ్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రేఖా గుప్తాను ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రి అని బీజేపీ ప్రకటించింది.