వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీ కి ఏపీ హైకోర్టు షాకిచ్చింది. తనపైనా.. తన వ్యక్తిగత సహాయకులపైనా నమోదైన కేసులను కొట్టి వేసేలా ఆదేశించాలని కోరుతూ.. దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసులు కొట్టి వేయలేమని.. ఇలా కొట్టి వేస్తూ పోతే.. ఇక, కేసులు నమోదు చేయడం ఎందుకని విడదల రజనీ తాలూకు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. అంతేకాదు.. ఈ కేసు విచారణ జరిగితే మంచిదే కదా? మీతప్పులేనప్పుడు మీరు నిర్భయంగా నిజాయితీగా బయటకు వచ్చే అవకాశం ఉంటుందని వ్యాఖ్యినించింది.

విడదల రజనీకి కోర్టు షాక్