Headline Image
27 ఏళ్ల తర్వాత ఢిల్లీ గడ్డపై కమల వికాసం.. ఆ ముగ్గురూ ఖేల్ ఖతం!

దేశ రాజ‌ధాని ఢిల్లీలో 27 ఏళ్ల త‌ర్వాత క‌మ‌లం విక‌సించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ ఎదురుదెబ్బ త‌గిలింది. 12 ఏళ్లుగా ఢిల్లీని పాలించిన ఆప్ కి బీజేపీ చెక్ పెట్టింది. భారీ ఆధిక్యంతో బీజేపీ ప్ర‌భుత్వ ఏర్పాటు దిశ‌గా దూసుకెళ్తుండ‌గా.. ఆప్ ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. మ‌రోవైపు కాంగ్రెస్ క‌నీసం ఖాతా కూడా తెర‌వ‌లేదు. ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం.. బీజేపీ 48 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆప్ 23 స్థానాల్లో మాత్రమే లీడ్ ఉంది.