Headline Image
జ‌గ‌న్‌ కు ఇర‌కాటం.. సాక్షి దెబ్బ రెడీ ..!

వైసీపీ అధినేత జ‌గ‌న్‌ కు మ‌రో ఇర‌కాటం ఎదురైంది. ఆయ‌న సొంత మీడియా సాక్షిపై అసెంబ్లీ స‌భాహ‌క్కు ల ఉల్లంఘ‌న కింద నోటీసులు ఇచ్చేందుకు రెడీ అయింది. ఇదేమీ చిన్న విష‌యం కాదు. పైగా.. ఏపీలో ఇదే తొలిసారి కూడా. దీంతో మీడియా వ‌ర్గాల‌లో ఈ విష‌యంపై జోరుగానే చ‌ర్చ సాగుతోంది. స‌హ‌జంగా ప‌త్రిక‌ల్లో వ‌స్తున్న క‌థ‌నాల‌పై .. ఎవ‌రికి వారు విశ్లేష‌ణ‌లు చేసుకుంటారు. గ‌తంలోనూ.. ఇప్పుడు కూడా.. ప‌త్రిక‌లు రెండుగా చీలిపోయి.. ఎవ‌రికి న‌చ్చిన పార్టీకి వారు మ‌ద్ద‌తు ఇస్తున్నారు.