ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేశ్.. తీసుకుంటున్న నిర్ణయాలు.. వేస్తున్న అడుగులు ప్రత్యర్థుల నుంచి కూడా పొగడ్తలు వచ్చేలా చేస్తున్నాయి. `ప్రజాదర్బార్` వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన లోకేష్.. అనతి కాలంలోనే ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇచ్చి.. దీనికి పార్టీ కార్యక్రమంగా.. తర్వాత ప్రభుత్వ కార్యక్రమంగా కూడా సీఎం చంద్రబాబు తీర్చిదిద్దారు. ఆ తర్వాత పెట్టుబడులపై పెద్ద ఎత్తున కసరత్తు చేశారు. తండ్రి కొడుకులు దావోస్ వెళ్లి.. పెట్టుబడులు దూసుకువచ్చే ప్రయత్నం చేశారు. పలితంగా 7 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వచ్చినట్టు సీఎం స్వయం చెప్పారు.

ఆ విషయంలో బాబు, లోకేశ్ పోటీ!