ఏపీ రాజకీయాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. 2024 ఎన్నికల్లో కూటమి అఖండ మెజారిటీతో అధికారంలోకి రాగా.. వైసీపీకి పాత్రం కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక వైసీపీ నుంచి వలసల పర్వం ఊపందుకుంది. వైసీపీకి చెందిన అనేక మంది ముఖ్య నేతలు జగన్ కు వీడ్కోలు పలికి పక్క పార్టీలకు జంప్ అవుతున్నారు. కొద్ది రోజుల క్రితం వైసీపీలో నెం.2గా విజయసాయిరెడ్డి ఏకంగా రాజ్యసభ సభ్యత్వానికి, పార్టీకి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసేసుకున్నారు. అయినప్పటికీ జగన్ వెనక్కి తగ్గట్లేదు.

జగన్ నయా ప్లాన్.. వైసీపీలోకి మరో కీలక నేత!