వైసీపీ హయాంలో ఆ పార్టీ అండ చూసుకొని గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై ఆనాటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసులో నిందితుడిగా ఉన్న వల్లభనేని వంశీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్ లో వంశీని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. రాయదుర్గంలోని ‘మై హోం భుజా’లో ఉన్న వంశీని విజయవాడ తరలిస్తున్నారు.

ఆ కేసులో వల్లభనేని వంశీ అరెస్ట్!