వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆయన సోదరి ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య గ్యాప్ వచ్చాక వైఎస్ విజయమ్మ కూతురు వైపే నిలబడ్డారు. ఆ తర్వాత జగన్ ఓడిపోవడం, అధికారాన్ని కోల్పోవడం తెలిసిందే. కొంతకాలం నుంచి వైఎస్ విజయమ్మ బయట పెద్దగా కనిపించడం లేదు. అయితే తాజాగా మంచు ఫ్యామిలీతో కలిసి విజయమ్మ దర్శనమిచ్చారు.