ఏపీ ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులకు శుభవార్త తెలిపింది. ఉచితంగా మూడు చక్రాల మోటారు వాహనాలు అందించనుంది. 70% వైకల్యం ఉన్న, 18-45 ఏళ్ల మధ్య వయసు కలిగి, పదో తరగతి పాసైన వారు అక్టోబర్ 31లోపు www.apdascac.ap.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. గతంలో దరఖాస్తు చేసుకుని మంజూరు కాని వారు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు.