అరకు లోయలో గిరిజనులు పండించే కాఫీ రుచి అమోఘం. ఇది మన్యం గ్రామాల్లోకి కాఫీ రైతులకి మంచి ఆదాయ మార్గంగా మారింది. దీనిని మరింతగా విస్తరించి.. అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకొచ్చేలా ఏపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ప్రముఖ సంస్థ టాటా బ్రాండింగ్ కోసం రంగంలోకి దిగింది. అయితే, ఈ కాఫీ గింజలను ప్రాసెస్ చేయడంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు కాఫీ పార్కు ఏర్పాటుచేస్తోంది.