విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల వన్డే కెరీర్ భవితవ్యంపై టీమిండియా మాజీ కెప్టెన్, రాయల్ బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశారు. వారిద్దరూ వచ్చే ద్వైపాక్షిక సిరీస్లో రాణిస్తే.. తప్పకుండా వన్డే జట్టులో ఉంటారని అంచనా వేశారు. అదే జరిగితే వన్డే ప్రపంచకప్ 2027లోనూ ఆడతారని అంచనా వేశారు. కోహ్లీ, రోహిత్లు బీసీసీఐ వన్డే ప్రపంచకప్ 2027 ప్లాన్స్లో లేరనే ప్రచారం మధ్య ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.