ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద నిషేధం విధించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ కనకదుర్గ ఆలయంలో తొలుత ఈ నిర్ణయం అమలు చేయనున్నారు. ఆ తర్వాత రాష్ట్రంలోని మిగతా ఆలయాలకు విస్తరించే పనిలో ఉన్నారు. మరోవైపు తిరుమలలో ఇప్పటికే ఈ విధానం అమలవుతున్న సంగతి తెలిసిందే.